Train: TCని బాత్రూమ్‌లో పెట్టి లాక్ వేసిన ప్ర‌యాణికులు!

Hyderabad: రైలులో  (train)ప్రయాణిస్తున్న‌వారికి కోపం రావ‌డంతో పాపం TCని బాత్రూమ్‌లో పెట్టి లాక్ వేసేసారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని సుహైల్‌దేవ్ సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో (suheildev superfast express) చోటుచేసుకుంది. ఘాజిపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలులోని బీ1, బీ 2 కోచ్‌ల‌లో ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో ఏసీ ఆగిపోయి ప్ర‌యాణికులు ఎంతో ఇబ్బందిప‌డ్డారు. దాంతో టికెట్ ఎగ్జామిన‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తితో గొడ‌వ‌ప‌డి కోపంతో ఆయన్ను బాత్రూమ్‌లో పెట్టి లాక్ వేసేసారు. రైలు తుండ్లా స్టేష‌న్‌కు రాగానే స్థానిక రైల్వే పోలీసులు రిపేర్ చేయిస్తామ‌ని ప్ర‌యాణికుల‌కు చెప్ప‌డంతో వారు శాంతించారు. ఆ త‌ర్వాత పాపం TCని కూడా ర‌క్షించారు.