Narendra Modi: TMC ర‌క్తంతో ఆట‌లు ఆడుతోంది!

Delhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) వెస్ట్ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ (tmc) పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఆ ప్రభుత్వం ర‌క్తంతో ఆట‌లు ఆడుతుంద‌ని అన్నారు. వెస్ట్ బెంగాల్‌లో (west bengal) క్ష‌త్రియ పంచాయ‌తీ రాజ్ ప‌రిష‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. BJP ఓటు వేయాల‌నుకుంటే వారి జీవితాల‌ను న‌ర‌కంలోకి నెట్టేస్తోంద‌ని ఆరోపించారు.

“” ఏవైనా ఎన్నిక‌లు జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రైనా BJP త‌ర‌ఫు నామినేష‌న్ వేయాల‌నుకుంటే వారిని చంపేస్తారు. BJP కార్య‌క‌ర్త‌ల‌నే కాదు. BJPకి ఓటు వేయాల‌నుకునేవారిని కూడా టార్చ‌ర్ పెడ‌తారు. పోలింగ్ బూత్‌లు TMC ఆధీనంలోనే ఉండాల‌ని కాంట్రాక్ట్‌లు ఇచ్చుకుంటారు. రాష్ట్రంలో TMC చేస్తున్న రాజ‌కీయం ఇది. ఓటింగ్ స‌మ‌యంలో పోలింగ్ బూత్‌ల నుంచి BJP కార్య‌క‌ర్త‌ల‌ను వెళ్ల‌గొట్ట‌డానికి గూండాల‌ను కిరాయికి తీసుకుంటారు. ఇంత చేసినా BJP గెలిస్తే గెలిచిన వారికి వ్య‌తిరేకంగా ర్యాలీలు చేప‌డ‌తారు“”  అంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు మోదీ (narendra modi)