Baby: పాల‌కు బ‌దులు మ‌ద్యం తాగించిన త‌ల్లి

America: బిడ్డ ఏడుపు ఆప‌క‌పోతే ఎత్తుకుని బుజ్జగించాలి కానీ ఓ క‌న్న‌త‌ల్లి ఏం చేసిందో తెలుసా? (baby) పాల సీసాలో పాల‌కు బ‌దులు మ‌ద్యం పోసి తాగించింది. ఈ దారుణ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన హొనెస్తి అనే మ‌హిళ త‌న బిడ్డ‌తో కారులో వేరే ప్ర‌దేశానికి వెళ్తోంది. అయితే ఎంత బుజ్జ‌గించినా బిడ్డ ఏడుపు ఆప‌క‌పోవ‌డంతో కాస్త మ‌ద్యం పోసి తాగించింది. దాంతో ఐదు నెల‌ల ప‌సికందు స్పృహ కోల్పోయాడు.

ఈ విష‌యం పోలీసుల‌కు ఎలా తెలిసిందో ఏమో కానీ.. వెంట‌నే ఆమెను అదుపులోకి తీసుకుని ప‌సికందును (baby) హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. బిడ్డ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది కూడా వెల్ల‌డించ‌లేదు. హోనెస్తిని మాత్రం అరెస్ట్ చేసి 60 వేల డాల‌ర్ల బాండ్‌పై రిలీజ్ చేసారు. అమెరికాలో ఇలాంటి మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒహాయోకి చెందిన ఓ మ‌హిళ 16 నెల‌ల బిడ్డ‌ను ఇంట్లో వ‌దిలేసి విహార‌యాత్ర‌కు వెళ్లింది. దాదాపు ప‌ది రోజుల పాటు ఆ బిడ్డ‌ని ప‌ట్టించుకోలేదు. దాంతో ఆక‌లికి ఆ ప‌సికందు చనిపోయింది. ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.