No Trust Motion: నేడు రాహుల్, అమిత్ షా డిబేట్

Delhi: అవిశ్వాస తీర్మానం (no trust motion) గురించి మంగ‌ళ‌వారం పార్లమెంట్‌లో జ‌రిగిన డిబేట్‌లో రాహుల్ గాంధీ (rahul gandhi) మాట్లాడ‌తారని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూసారు. కానీ నిన్న పార్ల‌మెంట్ సెష‌న్‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi) కానీ, కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) కానీ హాజ‌రుకాలేదు. దాంతో రాహుల్ డిబేట్‌లో ఏమీ మాట్లాడ‌లేదు. రాహుల్‌కి బ‌దులు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గొగోయ్ మాట్లాడారు. అయితే ఈ రోజు రాహుల్ డిబేట్‌లో మాట్లాడ‌నున్నారు. ఎందుకంటే అమిత్ షా పార్ల‌మెంట్ సెష‌న్‌ను అటెండ్ కాబోతున్నారు. రాహుల్, అమిత్ షా మ‌ధ్య ఎలాంటి డిబేట్ (no trust motion debate) జ‌ర‌గ‌నుందా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.