Mahesh Baghel: చ‌నిపోయార‌నుకున్న BJP నేత‌.. క‌ళ్లు తెరిచారు!

Hyderabad: సామాన్య ప్ర‌జ‌ల విష‌యంలో కొంద‌రు డాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే సంఘ‌ట‌న‌ల గురించి విన్నాం. కానీ రాజ‌కీయ నేత‌ల్లాంటి వీఐపీల విష‌యంలోనూ పొర‌పాట్లు చేస్తున్నారు. మ‌హేష్ బ‌ఘేల్ (mahesh baghel) అనే BJP నేత చ‌నిపోయాడ‌ని వైద్యులు చెప్ప‌డంతో ఆయ‌న కుటుంబీకులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌నుకున్నారు. తీరా చూస్తే ఆయ‌న ఉన్న‌ట్టుండి క‌ళ్లు తెరిచారు. దాంతో అంతా షాక‌య్యారు. కొంత‌కాలంగా మ‌హేష్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

దాంతో ఆయ‌న కొడుకులు ఢిల్లీలోని స్థానిక ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఆయ‌న అవ‌య‌వాల‌న్నీ ఫెయిల్ అయ్యాయ‌ని, చ‌నిపోయార‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దాంతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటుచేస్తుండ‌గా మ‌హేష్ క‌ళ్లు తెరిచారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను వేరే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆయ‌న ఛాతిలో ఇన్‌ఫెక్ష‌న్ సోకిందని, ట్రీట్మెంట్ చేస్తున్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. స‌రిగ్గా చెక్ చేయ‌కుండా త‌న తండ్రి చనిపోయాడ‌ని చెప్పిన డాక్ట‌ర్ల‌పై స్ట్రిక్ట్ యాక్ష‌న్ తీసుకోనున్న‌ట్లు మహేష్ కుమారులు మీడియా ద్వారా వెల్ల‌డించారు. (mahesh baghel)