Guntur Kaaram: 19 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్‌ సినిమాలో..!

Hyderabad: త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గుంటూరు కారం (guntur kaaram) నుంచి రోజుకో కొత్త అప్డేట్ వ‌స్తోంది. ఈ సినిమా విష‌యంలో మ‌హేష్ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. పాట‌లు, ఫైట్ సీన్స్, హీరోయిన్లు, సినిమాటోగ్రాఫ‌ర్.. ఇలా ప్ర‌తి విష‌యంలో మ‌హేష్ ఓకే అంటేనే ఫైన‌ల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ లేడీ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్ ఉండ‌బోతోంద‌ట‌. ఆ క్యారెక్ట‌ర్‌లో ర‌మ్యకృష్ణ‌ను (ramya krishnan)  తీసుకున్నార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే దాదాపు 19 ఏళ్ల త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌, మ‌హేష్ మ‌ళ్లీ స్క్రీన్‌పై క‌నిపిస్తారు. మ‌హేష్ న‌టించిన నాని (nani) సినిమాలో మార్కండేయ పాట‌లో ర‌మ్య‌కృష్ణ ఆడిపాడారు. 2024 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.