Janasena: గుడిలోకి వెళ్ల‌నివ్వ‌ని పోలీసులు

Vizag: జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్‌ (janasena) వారాహి యాత్ర (varahi yatra) మూడో షెడ్యూల్ ఈ నెల 10 నుంచి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో యాత్ర‌ విజయవంతం కావాలని భీమిలికి జ‌న‌సైనికులు వైజాగ్‌లోని రుషికొండ (rushikonda) TTD ఆలయంలో పూజ‌లు నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. రుషికొండ ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా అంటూ వారిని గుడిలోకి వెళ్ల‌నివ్వ‌లేదు. దాంతో చేసేది ఏమీ లేక కార్య‌క‌ర్త‌లు గుడి బ‌య‌టే ఎర్ర మ‌ట్టి దిబ్బ‌లు.. రుషికొండ‌.. గోవిందా… అంటూ రోడ్డు మీదనే కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోయారు.