Parliament Session: త‌ప్పుకున్న రాహుల్‌.. !

Delhi: పార్ల‌మెంట్ సెష‌న్ (parliament session) మొద‌లైంది. దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టారు. ఈరోజు మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion) గురించి రాహుల్ డిబేట్ పెట్టాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల డిబేట్ నుంచి రాహుల్ త‌ప్పుకున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత గౌర‌వ్ గొగోయ్ (gaurav gogoi) డిబేట్ ప్రారంభించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని (narendra modi) సూటిగా ప్ర‌శ్నించారు. మీరెందుకు ఇప్ప‌టివ‌ర‌కు మ‌ణిపూర్ వెళ్ల‌లేదు అనే ప్ర‌శ్న‌తో సెష‌న్ ప్రారంభ‌మైంది. అడిగిన దానికి ఆన్స‌ర్ చెప్ప‌కుండా BJP కాంగ్రెస్‌ను (congress) టీజ్ చేసింది. మేం రాహుల్ మాట్లాడితే వినాల‌ని అనుకున్నాం. ఈ ఐదు నిమిషాల్లో ఏం జ‌రిగింది? అంటూ టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు య‌త్నించారు.