Telangana: ఫైనల్‌గా మీరూ మీరూ…!

Hyderabad: కాంగ్రెస్ BJP కార్య‌క‌ర్త‌లు క‌లిసిపోయి అధికార BRSకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్‌, BJP నాయకులు పరస్పరం తలపడుతున్నట్లు బిల్డ‌ప్ ఇస్తారు. బాన్సువాడలో సోమ, మంగళవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు మంచి ఉదాహరణ. అటు ప్రభుత్వానికి, ఇటు స్పీకర్‌ పోచారం కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై రెండు పార్టీల నాయకులు కలిసి నిరసన చేపట్టడం చూసి జనం నవ్వుకున్నారు. కాంగ్రెస్‌ (congress), కాషాయ దళం కలిసి చేస్తున్న గ్రూప్‌ రాజకీయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. (telangana)