Vinod Sharma: ఆ హింస‌కు మోదీనే కార‌ణం.. రాజీనామా చేస్తున్నా

Manipur: గ‌త మూడు నెల‌లుగా మణిపూర్‌లో (manipur) జ‌రుగుతున్న హింస‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే కార‌ణమంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు BJP అధికార ప్ర‌తినిధి వినోద్ శ‌ర్మ‌ (vinod sharma). నరేంద్ర మోదీ (narendra modi) నిద్రపోతున్నార‌ని ఆయన మీద నమ్మకం లేద‌ని అందుకే రాజీనామా చేస్తున్నాన‌ని మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. పైగా మ‌ణిపూర్ హింస‌కు మోదీ, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బిరేన్ సింగ్‌లే (biren singh) కార‌ణ‌మంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేసి మ‌రీ రాజీనామా చేసారు.

“” ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు.. మహిళలను ఇలా అవమానించి చంపమని సనాతన ధర్మంలో ఉందా? నేను ఢిల్లీకి వెళ్లి 5 రోజులు ఉన్నాను. ఈ ఘటనలో సమర్ధిస్తూ మాట్లాడమని నాతో చెప్పారు. దీంతో నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను “” అని వెల్ల‌డించారు వినోద్. (vinod sharma)