Janasena గూటికి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్?

AP: YSRCP నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ (pilli subhash chandra bose) జ‌న‌సేన‌లో (janasena) చేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి YSRCP సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు (chelluboina venugopala krishna) విభేదాలు ఉన్నాయి. వేణుగోపాల కృష్ణ‌కు టికెట్ ఇస్తే.. తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తాన‌ని పిల్లి సవాల్ విసిరారు. దాంతో బోస్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేనలో చేర‌నున్న‌ట్లు రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి జనసేనలో టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న‌ట్లు కూడా తెలుస్తోంది.