Pawan Kalyan: YSRCP 5 లక్షల ట్యాబ్లెట్లు కొంటుందా?

AP: ఏపీ ప్ర‌భుత్వం విద్యా వ్య‌వ‌స్థ‌లో బైజూస్‌ని (byjus) ఇన్‌వాల్వ్ చేయడం ప‌ట్ల టీచ‌ర్లు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. జూన్‌లో ప్ర‌ముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ సీఈఓ ర‌వీంద్ర‌న్‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఏడాదికి రూ.20–24వేలు చెల్లిస్తేకాని లభించని కంటెంట్‌ ఇప్పుడు పేదపిల్లలకు అందుబాటులోకి వస్తుంద‌ని జ‌గన్ అన్నారు. ఇది న‌చ్చ‌ని ఏపీ ఉపాధ్యాయులు దీనికి తాము వ్య‌తిరేకంగా ఉన్నామ‌ని నిర‌స‌న వ్య‌క్తం చేసారు. అయితే ఏపీ ప్ర‌భుత్వం బైజూస్‌తో టైఅప్ అయిన విధానంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) కొన్ని ప్ర‌శ్న‌లు వేసారు.

1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.

2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.

3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?

ప్రశ్నించదగిన అంశాలు

1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.

2.8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.

3. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు)
4. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?
5. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?