Manipur Violence: మ‌హిళ ప‌రువుపోతే కానీ స్పందించ‌రా?

Delhi: కొన్ని నెల‌లుగా మ‌ణిపూర్‌లో (manipur violence) అల్ల‌ర్లు జ‌రుగుతుంటే కేంద్రం స్పందించ‌లేదు. నిన్న ఓ మ‌హిళ‌ను న‌గ్నంగా న‌డి రోడ్డుపై ఊరేగించిన వీడియో బ‌యటికి రావ‌డంతో యావ‌త్ భార‌త‌దేశం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఓ మ‌హిళ ప‌రువు న‌లుగురిలో అల్లరి పాలయితే కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి (narendra modi) స్పంద‌న క‌ల‌గ‌లేదేమో. మొత్తానికి ఆయ‌న మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ చూస్తుంటే నా హృదయం కోపంతో, బాధతో రగిలిపోతుంది. ఇది దేశమంతా సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం. ఇలాంటి వాటికి పాల్పడేవాళ్లు దేశం పరువు తీస్తున్నారు, నిందితులు ఎవ‌రైనా స‌రే. వ‌దిలిపెట్టేది లేదు అని పార్ల‌మెంట్ సెష‌న్‌లో మోదీ స్పందించారు. (manipur violence)