BJP నాయ‌కుల‌ హౌజ్ అరెస్ట్

Hyderabad: ప‌లువురు BJP నాయ‌కుల‌ను తెలంగాణ‌ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. తెలంగాణ ప్ర‌భుత్వం బాటా సింగారం ద‌గ్గ‌ర క‌ట్టించిన‌ 2 బీహెచ్‌కే ఇళ్ల‌ను ప‌రిశీలించాల‌ని BJP నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో జంట న‌గ‌రాల్లో BJP నేత‌ల‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దాంతో BJP తెలంగాణ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (kishan reddy) ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీల నోరు మూయించ‌డం BRS గ‌వ‌ర్న‌మెంట్‌కు అలవాటేనని కిష‌న్ రెడ్డి అన్నారు. హౌజ్ అరెస్ట్ అయిన BJP నేత‌ల్లో ఈటెల రాజేంద‌ర్, ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు, బంగారు శ్రుతి, దుగ్యాల ప్ర‌దీప్ కుమార్ ఉన్నారు.