Uttarakhand: క‌రెంట్ షాక్.. 15 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో (uttarakhand) దారుణం చోటుచేసుకుంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యుతాఘాతంలో (electrocution) దాదాపు 15 మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. చ‌మోలీ జిల్లాలో అల‌క‌నంద న‌దీ తీరం ద‌గ్గ‌ర‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేల‌డంతో విద్యుదాఘాతం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో న‌మామి గంగే (namami gange) సైట్ ద‌గ్గ‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌నుల్లో బిజీగా ఉన్న వ‌ర్క‌ర్ల‌పై విద్యుత్ తీగ‌లు తెగి ప‌డ‌టంతో 15 మంది మృత్యువాత‌ప‌డిన‌ట్లు స‌మాచారం. గాయ‌ప‌డిన వారిని ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తున్నారు.