Nara Lokesh: మాకు ఓటేసాక చెప్పు నీ క‌ష్టాలు

AP: యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్న నారా లోకేష్ (nara lokesh) ఇర‌కాటంలో ప‌డ్డారు. మిగ‌తా స‌మ‌యాల్లో ఎలా ఉన్నా కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ‌నేత‌లు ప్ర‌జ‌ల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ లోకేష్ (nara lokesh) ఆ విష‌యం మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. ఓ మ‌హిళ త‌న క‌ష్టాలు చెప్పుకోవ‌డానికి లోకేష్ ద‌గ్గ‌రికి వ‌స్తే.. ఓటేసినప్పుడు అడుగు ఇప్పుడు కాదు అని లోకేష్ ద‌బాయించారు. దాంతో ఆ మ‌హిళ‌కు ఒళ్లు మండింది. పోలీసులు ఉన్నార‌ని కూడా చూడ‌కుండా.. పోయిన సారి మీకు ఓటేసినప్పుడు మీరేం పీకారు అని అక్క‌డిక‌క్క‌డే నిల‌దీసింది. దాంతో లోకేష్ కూడా కోపం కంట్రోల్ చేసుకోలేక‌.. ఎప్పుడేసావ్ ఓటు నువ్వు. 20 ఏళ్ల క్రితం నేను చిన్నగా ఉన్న‌ప్పుడు వేసావ్. రాబోతున్న ఎన్నిక‌ల్లో మాకు ఓటేసి అప్పుడు అడుగు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.