Mutyala Naidu: ప‌వ‌న్‌కి ఏపీ డిప్యూటీ సీఎం కౌంట‌ర్

AP: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ ముత్యాల నాయుడు (mutyala naidu) కౌంట‌ర్ ఇచ్చారు. మొన్న ఏలూరులో జ‌రిగిన వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ ఏపీ వాలంటీర్ల వ్య‌వ‌స్థ వ‌ల్ల 18 వేల మంది మ‌హిళ‌లు మిస్స‌య్యారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ముత్యాల నాయుడు స్పందించారు. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డ‌ర్ చేస్తే ఇంటి అడ్ర‌స్, ఫోన్ నెంబ‌ర్, మెయిల్ ఐడీ అంటూ అన్ని వివ‌రాలు అడుగుతారు. నీ దృష్టిలో వాళ్ళు చేసేది డేటా బ్రీచా? సంక్షేమ ప‌థ‌కాలకు అర్హుల ఎంపిక‌కు వాలంటీర్లు వివ‌రాలు సేక‌రిస్తే నువ్వు నా డేటా నా హ‌క్కు అని ఏదేదో అంటావేంటి? అని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు.