RRR 2 డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాదు

Hyderabad: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి (ss rajamouli) తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ (vijayendra prasad) గుడ్ న్యూస్ చెప్పేసారు. ఇండియాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన RRR సినిమాకు సీక్వెల్ (RRR 2) రాబోతోంద‌ని క‌న్ఫామ్ చేసేసారు. అయితే ఇక్క‌డే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. సీక్వెల్‌లోనూ మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), యంగ్ టైగ‌ర్ NTR రామ్‌, భీమ్ పాత్ర‌ల్లో న‌టిస్తారు కానీ సినిమాను రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు. ఒక‌వేళ అన్నీ ఓకే అయ్యి సినిమా సెట్స్‌పైకి వెళ్తే మాత్రం రాజ‌మౌళి హెల్ప్‌తో మ‌రో డైరెక్టర్ ఈ సినిమాను తీసే ఛాన్స్ ఉంద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.

ఎందుకంటే ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న రాజ‌మౌళి సూపర్‌స్టార్ మ‌హేష్ (mahesh babu SSMB 29) బాబుతో తీయ‌బోయే సినిమా కోసం వ‌ర్క్‌షాప్స్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఆయ‌న ఒకేసారి ఒక సినిమాపైనే ఫోక‌స్ చేసే వ్య‌క్తి. కాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన RRR సినిమా చ‌క్క‌గా రావాలంటే త‌నైనా సినిమా చేయాలి లేదా కంప్లీట్‌గా వేరే డైరెక్టర్ చేతిలో అయినా పెట్టాలి. స‌గం అటు స‌గం ఇటు ఫోక‌స్ చేస్తే మాత్రం రిజ‌ల్ట్ పాడ‌వుతుంద‌ని రాజ‌మౌళి (rajamouli) అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న RRR సీక్వెల్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుందో వేచి చూడాలి. ఇక సినిమాలోని సేమ్ క్యారెక్ట‌ర్స్ రిపీట్ అవుతాయా లేదా అనేది కూడా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ టైంలో తెలుస్తుంది.