Vasireddy Padma: ప‌వ‌న్ సినిమాల వ‌ల్లే చెడిపోతున్నారు

AP: ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) చేస్తున్న సినిమాల వ‌ల్లే యువ‌త చెడిపోతున్నార‌ని మండిప‌డ్డారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళా క‌మిష‌న్ అధ్య‌క్షురాలు వాసిరెడ్డి ప‌ద్మ‌ (vasireddy padma). నిన్న వారాహి యాత్ర స‌మ‌యంలో ప‌వన్ ఏలూరులో మాట్లాడుతూ.. ఏపీ వాలంటీర్లు (ap volunteers) హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఈ స‌మాచారం త‌న‌కు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి అందిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో వాసిరెడ్డి ప‌ద్మ (vasireddy padma) ప‌వ‌న్‌కు నిన్న మ‌హిళా క‌మిష‌న్ త‌ర‌ఫున నోటీసులు జారీ చేసారు. ప‌వ‌న్ (pawan kalyan) చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని లేదంటే సారీ చెప్పాల‌ని డిమాండ్ చేసారు. ప‌వ‌న్ సారీ చెప్పేవ‌ర‌కు మ‌హిళా క‌మిష‌న్ వెంటాడుతూనే ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. అస‌లు ఏపీలో అమ్మాయిలు అదృశ్యం కావ‌డానికి కార‌ణం ప‌వ‌న్ చేస్తున్న సినిమాలేన‌ని, ఆయ‌న సినిమాలు కాలేజ్ ప్రేమ‌ని చూపిస్తున్నాయి కాబ‌ట్టే యూత్ వాటిని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నార‌ని అన్నారు.