Pawan Kalyan: వాలంటీర్ల‌ చేత ఊడిగం చేయించుకుంటున్నారు

AP: ఏపీ వాలంటీర్ల చేత సీఎం జ‌గ‌న్ (ap cm jagan) ఊడిగం చేయించుకుంటున్నార‌ని మండిప‌డ్డారు జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్‌ (pawan kalyan). వాలంటీర్లు హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కి పాల్ప‌డుతున్నారంటూ నిన్న షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ (pawan kalyan) ఇప్పుడు వాలంటీర్ల (ap volunteers) క‌డుపు కొట్టాల‌న్న‌ది త‌న ఉద్దేశం కాద‌ని అన్నారు. రూ.5000 జీతం ఇచ్చి వాలంటీర్లును జ‌గ‌న్ కట్టిపడేస్తుడ‌ని, డిగ్రీ చేసిన యువతకు 5000 జీతం ఏంటని ప్ర‌శ్నించారు. ఉపాధి హామీ పథకం పనులకు కూడా అంత తక్కువ డబ్బులు ఇవ్వరని వారిలో ఎంతో ప్రతిభ దాగి ఉన్న‌ప్పుడు దాన్ని వెలికి తీయకుండా ఊడిగం జ‌గ‌న్ ఊడిగం చేయించుకుంటున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మొత్తానికి నిన్న వాలంటీర్లు డిమాండ్ చేసిన‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేదు.