British Airlines: బ‌రువు ఎక్కువై ప్యాసెంజ‌ర్స్‌ని దించేసారు..!

Hyderabad: విమానంలో బ‌రువు ఎక్కువైతే ల‌గేజీని దించేయ‌డాన్ని చూసాం కానీ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కి (british airlines) చెందిన ఓ విమానంలో మాత్రం ఏకంగా ప్యాసెంజ‌ర్ల‌నే దించేసారు. ఈ ఘ‌ట‌న ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈజీ జెట్ విమానం ఒక‌టి లాంజారూట్ నుంచి లివర్‌పూల్‌కి వెళ్లాల్సి ఉంది. రాత్రి 9:45కి ఫ్లైట్ టేకాఫ్ అవ్వాల్సి ఉంది. ప్యాసెంజ‌ర్లు ఎక్కి హాయిగా కూర్చుని ఉన్నారు. అయితే అప్ప‌టికే వాతావ‌రణం అనుకూలంగా లేదు. అందులోనూ విమానంలోని ప్ర‌యాణికుల బ‌రువు మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ట‌.

దాంతో పైల‌ట్ ఒక అనౌన్స్‌మెంట్ చేసాడు. విమానంలో ఉన్నావారంద‌రికీ హ‌ల్లో. టేకాఫ్ అవ్వ‌డానికి నా వ‌ల్ల కావ‌డంలేదు. ఎందుకంటే ప్ర‌యాణికులు ఎక్క‌వ మంది ఉండ‌టంతో విమానం బ‌రువు మోయ‌లేక‌పోతోంది. ఏమీ అనుకోకుండా ఒక 20 మంది దిగిపోండి అని అనౌన్స్ చేసారు. దాంతో ప్యాసెంజ‌ర్లు షాక‌య్యారు. ఇలాంటి ఘ‌ట‌న ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌లేదంటూ బూతులు తిట్టుకున్నారు. అయితే ఎవ‌రు దిగిపోవాల‌ని అనుకుంటున్నారో వారినే డిసైడ్ చేసుకోమ‌న్నారు. అలా దాదాపు 19 మంది విమానం దిగేసారు. ఈ డ్రామా అంతా అయ్యేస‌రికి 11:30 అయ్యింది. అలా మొత్తానికి విమానం టేకాఫ్ అయింది.