Adipurush: ఇప్పుడెందుకు సారీ?

Hyderabad: చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లుంది బాలీవుడ్ తీరు. పాపం ప్ర‌భాస్ (prabhas) చేత ఆదిపురుష్ (adipurush) సినిమాకు బ‌ల‌వంతంగా ఓకే చెప్పించి సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్ అయ్యేలా చేసి ఇప్పుడు సారీ అంటున్నారు. ఆదిపురుష్ సినిమాకు మ‌నోజ్ ముంతాషిర్ (manoj muntashir) డైలాగులు రాసారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆయ‌న రాసిన డైలాగుల‌పై కామ‌న్ పీపుల్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ మండిప‌డ్డారు. దీనికి అప్పుడే సారీ చెప్పేసి ఉంటే అయిపోయేది. అలా కాకుండా ఇప్ప‌టి త‌రానికి అర్థం అవ్వాలంటే అలాగే రాయాలి, పైగా ఇది అస‌లు రామాయ‌ణ‌మే కాదు హ‌నుమంతుడు అస‌లు దేవుడే కాదు అంటూ మ‌నోజ్ నోరుజారారు.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమాను మెల్లి మెల్లిగా అంద‌రూ మ‌ర్చిపోతున్న స‌మ‌యంలో వ‌చ్చి మ‌నోజ్ ముంతాషిర్ అంద‌రికీ సారీ అని ప్ర‌క‌ట‌న వ‌దిలారు. ప్రజ‌ల మ‌నోభావాలు అర్థ‌మ‌య్యాయ‌ని, ఇలాంటి డైలాగులు రాసి హ‌ర్ట్ చేసి ఉంటే క్ష‌మించాల‌ని కోరారు. అయితే ఇప్పుడు నెటిజన్స్‌, ఫ్యాన్స్‌కి ఇంకా మండిన‌ట్లుంది. ఇప్ప‌టికే చాలా లేట్ అయిపోయింద‌ని, ఇప్పుడు సారీ చెప్పినా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని మండిప‌డుతున్నారు. బ‌హుశా ఆయ‌న‌కు బాలీవుడ్‌లో రైట‌ర్‌గా ఛాన్సులు రావ‌డం లేదేమో అందుకే ఇప్పుడు సారీ చెప్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.