Narendra Modi: KCR అవినీతి దిల్లీ దాకా పాకింది

Warangal: తెలంగాణ సీఎం KCR అవినీతి దిల్లీ వ‌ర‌కు పాకిందని విమ‌ర్శించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi). తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించిన మోదీ.. BRS స‌ర్కారుపై మండిప‌డ్డారు. తెలంగాణలో అవినీతి అరోపణలు లేకుండా ఏ ప్రాజెక్టు లేదని అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది KCR ప్రభుత్వమ‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.