Narendra Modi KCRకి వార్నింగ్ ఇచ్చారా?

Hyderabad: తెలంగాణ సీఎం KCRకి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) వార్నింగ్ ఇచ్చార‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు BJP మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి (jithender reddy). ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న జితేందర్ రెడ్డి.. ఉన్న‌ట్టుండి BRS ఎందుకు BJPపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చారు. ఒక‌ప్పుడు BJPని బంగాళాఖాతంలో విసిరేస్తా అని స‌వాలు విసిరిన KCR ఇప్పుడు అస‌లు BJPని ఏమీ అన‌డంలేదు. ఇందుకు కార‌ణం ఏమై ఉండొచ్చు అని అడిగితే.. మోదీ KCRను ప‌ర్స‌న‌ల్‌గా పిలిచి కొడ‌కా ఇంకోసారి తిడ‌తే లోప‌లేస్తరా అని తిడ‌తే కేసీఆర్ భ‌య‌ప‌డ్డాడు అని షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు.

అయితే BRS BJP క‌లిసిపోయినందుకే బండి సంజ‌య్‌ని (bandi sanjay) తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తీసేసార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ.. బండి సంజ‌య్‌ది మూడేళ్ల ట‌ర్మ్ అయిపోయినందుకు ఆయ‌న్ని తీసేసారే త‌ప్ప వేరే ఉద్దేశంతో కాద‌ని అన్నారు. ఎవరు ఎన్ని సవాళ్లు విసిరినా ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా BJP భ‌య‌ప‌డే పార్టీ కాద‌ని తెలిపారు.