Bandi Sanjay: కంట‌త‌డి పెట్టిన కరీంన‌గ‌ర్ ఎంపీ

Hyderabad: క‌రీంన‌గ‌ర్ ఎంపీ, BJP రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ (bandi sanjay) ఎమోష‌న‌ల్ అయ్యారు. వరంగల్‌లో ఈనెల 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) సభకు రానున్నారు. ఈ స‌భ‌కు BJP అధ్యక్షుడిగా వస్తానో లేదో అంటూ కార్యకర్తల దగ్గర బండి సంజయ్ (bandi sanjay) భావోద్వేగానికి గుర‌య్యారు. ఇప్పుడు BJP ఈ స్థాయిలో ఉందంటే మీరే కారణం, అధ్యక్షుడిగా మీరే కొనసాగాలి అంటూ BJP కార్యకర్తలు కూడా ఆయ‌న్ని ఓదార్చేందుకు ప్ర‌య‌త్నించారు. కొంత‌కాలంగా BJP రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విలో మార్పులు చోటుచేసుకోబోతున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. బండి సంజ‌య్ సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ప‌లువురు తెలంగాణ BJP నేతలు హై క‌మాండ్‌కు ఫిర్యాదు చేసారు. ఈ నేప‌థ్యంలో BJP రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి మార్చాల‌ని స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.