Kishan Reddy: ఇచ్చిన‌వాటితో సంతోష‌ప‌డండి

Hyderabad: బ‌య్యారానికి ఉక్కు కార్మాగారం ఎందుకు ఇవ్వ‌లేదు అని ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన దానితో సంతోష‌ప‌డండి అంటూ బ‌దులిచ్చారు BJP మంత్రి కిష‌న్ రెడ్డి (kishan reddy). వ‌రంగ‌ల్‌లో ఏర్పాటుచేసిన స‌మావేశంలో BJP రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ (bandi sanjay), కిష‌న్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో మౌలిక వ‌స‌తుల కోసం కేంద్రం మంచి నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఓ జ‌ర్న‌లిస్ట్ మ‌రి బ‌య్యారానికి ఉక్కు కార్మాగారం స‌ర్‌..? అని అడిగితే.. ఇచ్చిన‌వాటితో సంతోష‌ప‌డండి అయ్యా. ఇచ్చిన‌వాటి కోసం అసలు చప్ప‌ట్లే కొట్ట‌రు అని కిష‌న్ రెడ్డి అన‌డం వైర‌ల్ అవుతోంది. ఈ నెల 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) వ‌రంగ‌ల్‌లో పర్య‌టిస్తార‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.