Chandrababu Naidu పీఏతో పాటు 45 మందిపై కేసు?

AP: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) పీఏతో పాటు 45 మందిపై కేసులు న‌మోద‌య్యాయి. చిత్తూరు – కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. TDP నేతలు తన విధులకు ఆటంకం కలిగించారని, ఎస్సై డౌన్‌ డౌన్‌ అన్న నినాదాలతో పోలీస్‌స్టేషను ఎదుట ధర్నా చేపట్టి ఫిర్యాదుదారులను స్టేషన్‌కు రానివ్వకుండా అడ్డుకోవడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని రామకుప్పం హెడ్‌కానిస్టేబుల్‌ మణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ సహా 45 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.