Revanth Reddy: డ‌బ్బున్న రెడ్లు వ‌స్తేనే లోనికి రానిస్తా

Hyderabad: TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి (revanth reddy) కుల పిచ్చి బాగా ప‌ట్టుకుంది. ఎన్నిక‌ల రాబోతున్న స‌మ‌యంలో ఎక్క‌డికి వెళ్లినా రెడ్ల కులం గురించే డ‌ప్పు కొట్టుకోవ‌డంతో స‌రిపోతోంది. మొన్న రెడ్ల‌కు క‌నీసం ప‌ది ఎక‌రాలు ఉంటేనే రాజ్యం, రాజ‌కీయం రెడ్ల చేతిలో ఉంటుంద‌ని మాట్లాడిన రేవంత్ (revanth reddy) ఇప్పుడు మ‌రో షాకింగ్ కామెంట్ చేసారు. తన ఇంటికి వ‌చ్చే చుట్టాల‌లోనే.. వారికి బాగా డ‌బ్బు ఉంటేనే ఇంట్లోకి రానిస్తాన‌ని, లేక‌పోతే గ‌న్‌మెన్లు బ‌య‌ట నిల‌బెడ‌తార‌ని అంటున్నారు. ఇలా మీడియా ముందు డైరెక్ట్‌గా రెడ్లు రెడ్లు అంటూ కామెంట్లు చేయ‌డం, మిగ‌తా కులాల వారని త‌క్కువ చేసి మాట్లాడ‌టం ఏంటో ఈయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చిన కాంగ్రెస్ హై క‌మాండ్‌కే తెలియాలి. ఇలాంటి వారు ప్ర‌జ‌ల‌ను పాలిస్తున్నారంటే అది తెలంగాణ చేసుకున్న దుర‌దృష్టం అంటూ ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు.