Viral News: బీమా డ‌బ్బు కోసం ఇంత నాట‌క‌మా?

Punjab: బీమా డ‌బ్బుల కోసం ఫ్రెండ్‌ని చంపేసాడు ఓ నీచుడు (viral news) . అంత‌టితో ఆగ‌లేదు. అత‌ను వేసిన ప్లాన్‌కి పోలీసులే షాక‌య్యారు. పంజాబ్‌లో చోటుచేసుకుంది ఈ ఘ‌ట‌న‌. రామ్ దాస్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్, సుఖ్‌జీత్ అనే ఇద్ద‌రు ఫ్రెండ్స్ సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిపే రూ.4 కోట్ల‌కు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకున్నారు. అయితే వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు రాలేదు. దాంతో ఎలాగైనా బీమా డ‌బ్బులు కాజేయాల‌ని గురుప్రీత్ ప్లాన్ వేసాడు. త‌న భార్య ఖుష్‌దీప్‌, మ‌రో న‌లుగురు ఫ్రెండ్స్‌తో క‌లిసి సుఖ్‌దీప్‌ని చంపాల‌ని ప్లాన్ చేసాడు. అనుకున్న విధంగానే సుఖ్‌దీప్‌ను చంపేసారు. ఒక్క‌డు చ‌నిపోతే మొత్తం రూ.4 కోట్లు రావ‌ని త‌ను కూడా చ‌నిపోయిన‌ట్లు ఆధారాలు సృష్టించాడు. కొన్ని రోజులుగా సుఖ్‌దీప్ ఇంటికి రాక‌పోయే స‌రికి అత‌ని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో కొన్ని రోజులుగా గురుప్రీత్.. త‌న భ‌ర్త సుఖ్‌దీప్ కోసం లిక్క‌ర్ తెస్తున్నాడ‌ని పేర్కొంది. దాంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి గురుప్రీత్ ఇంటికి వెళ్లారు. గురుప్రీత్ ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోయాడ‌ని చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. గురుప్రీత్, సుఖ్‌దీప్ క‌లిసి రూ.4 కోట్లు బీమా తీసుకున్నార‌న్న విష‌యం పోలీసుల‌కు తెలీడంతో ప్లాన్ అర్థ‌మైపోయింది. వారి స్టైల్‌లో విచార‌ణ చేప‌ట్ట‌డంతో గురుప్రీత్ బ‌య‌ట‌ప‌డ్డాడు. దాంతో పోలీసులు గురుప్రీత్‌ని, అత‌ని భార్య‌ను, ఈ దారుణానికి స‌హ‌క‌రించిన ఇత‌ర ఫ్రెండ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.