Ram Gopal Varma: ప‌వ‌న్‌లా హిట్ల‌ర్ కూడా మాట్లాడ‌లేదు..!

Hyderabad: వారాహి యాత్ర‌లో (varahi) బిజీగా ఉన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి సెటైర్ వేసారు రామ్ గోపాల్ వ‌ర్మ‌ (ram gopal varma). యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ YCP నేత‌ల‌ను, వారి పాల‌న గురించి మాట్లాడుతూ.. న‌రుకుతా, న‌డిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై వ‌ర్మ స్పందించారు. ఎంత ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తే మాత్రం ఇలా దారుణంగా ఏ రాజ‌కీయ నాయ‌కుడూ మాట్లాడ‌డ‌ని అన్నారు. ప‌వ‌న్‌లా హిట్ల‌ర్, కిమ్‌, స‌ద్దామ్ హుస్సేన్ కూడా మాట్లాడ‌దేని కామెంట్ చేసారు.

“మొత్తానికి రాజ‌కీయ ప్ర‌చారాలు ఎక్క‌డిదాకా వ‌చ్చాయంటే.. నేను అధికారంలోకి వ‌స్తే ప్ర‌తిప‌క్ష నాయ‌కుల గొంతులు నులుముతా, గొంతులు కోసి చంపుతా, న‌గ్నంగా న‌డిరోడ్ల‌పై ఊరేగిస్తా, చ‌ర్మం వ‌లిచేస్తా అనేదాకా వ‌చ్చాయి. ఇవ‌న్నీ జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌బ్లిక్ మీటింగ్స్‌లో మాట్లాడుతున్న మాట‌లు. ఆయ‌న చెప్పేవ‌న్నీ జ‌నాలు ఇంట్లో కూర్చుని వింటున్నారు. టీవీ ఆన్ చేస్తే ప‌వ‌న్ మాట‌లు పిల్ల‌లు కూడా వింటారు. ప్ర‌పంచంలో ఘోరమైన పాల‌న‌లు చేసిన నేత‌లైన హిట్ల‌ర్, కిమ్, స‌ద్దామ్ హుస్సేన్ వంటి వారు కూడా ఇలా మాట్లాడి ఉండ‌రు. ఇలాంటి మాట‌లు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటివాటిని ప్రేరేపించేలా ఉన్నాయి. ఇలా మాట్లాడి ప‌వ‌న్ ఎలాంటి స‌మాజాన్ని సృష్టించాల‌నుకుంటున్నారో ఏమో” అని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు వ‌ర్మ‌.