Secunderabad: దారుణం.. పిల్ల‌ల‌తో స‌హా త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌..!

Hyderabad: సికింద్రాబాద్‌లో (secunderabad) దారుణం చోటుచేసుకుంది. బన్సిలాల్ పేటకు చెందిన ఓ మ‌హిళ‌.. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేదింపులు తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. రోజూ ఆమె భ‌ర్త అందంగా లేవ‌ని, క‌ట్నం ఇవ్వ‌లేద‌ని వేధిస్తుండేవాడ‌ని, ఆ టార్చ‌ర్ భ‌రించ‌లేక క‌వ‌ల పిల్ల‌ల‌తో స‌హా దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌న‌కు బ‌ల‌మైన గాయాలు కావ‌డంతో ముగ్గురూ అక్కడిక‌క్క‌డే మృతిచెందారు. పోలీసులు ఆమె భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.