ప్ర‌జ‌ల ఫండ్స్ వాడుకున్నా: BJP ఎంపీ

Hyderabad: ఓ స‌మావేశంలో ఎంపీ ల్యాడ్ ఫండ్స్ వాడుకున్నాన‌ని ప‌బ్లిక్‌గా చెప్పి బుక్ అయ్యారు ఆదిలాబాద్ BJP ఎంపీ సోయం బాపూరావు (soyam bapurao). ఇటీవ‌ల పార్టీ కౌన్సిల‌ర్లు, ఎంపీటీసీల‌తో క‌లిసి త‌న ఇంట్లో స‌మావేశం నిర్వ‌హించారు బాపూరావు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇల్లు అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి..ఎంపీ ల్యాడ్ ఫండ్స్‌తో ఇల్లు క‌ట్టుకున్నాన‌ని, ఆ డ‌బ్బులో కొంత తీసి కొడుకు పెళ్లి కూడా చేసాన‌ని చెప్పారు. పైగా ఇలా ఏ నేతా ధైర్యంగా చెప్పుకోడ‌ని, కానీ తాను మాత్రం చెప్పుకుంటున్నాన‌ని ఏదో గొప్ప ప‌ని చేసిన‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చారు. ఆయ‌న మాట‌లు విని మీటింగ్‌కి వ‌చ్చిన‌వాళ్లు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీని గురించి స్థానిక మీడియా వ‌ర్గాలు ఆయ‌న్ని ప్ర‌శ్నించ‌గా.. అస‌లు తాను అలా అన‌లేద‌ని, పార్టీలో కొంద‌రు కావాలంటే ఇలా త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని అంటున్నారు.