Chandrababu దొంగ అని చెప్పిందే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌!

AP: చంద్ర‌బాబు (chandrababu) ఒక దొంగ అని ముందు ఆరోపించింది ప‌వ‌న్ క‌ళ్యాణేన‌ని అంటున్నారు YCP నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (byreddy siddharth reddy). వారాహి యాత్ర‌లో గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్.. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా ఏపీ సీఎం జగ‌న్ మోహ‌న్ రెడ్డిని, పార్టీలో ఉన్న కొంద‌రి అరాచ‌క పాల‌న గురించి మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. అస‌లు జ‌గ‌న్ గురించి మాట్లాడ‌టానికి ప‌వన్‌కు ఏం అధికారం ఉంద‌ని ప్ర‌శ్నించారు.

“పొద్దున లేస్తే ఏం మాట్లాడాలో ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలో క్లారిటీ లేని ప‌వ‌న్‌కు జ‌గ‌న్ అన్న గురించి మాట్లాడే హ‌క్కు లేదు. ప‌వ‌న్ కంటే జ‌గ‌న్ వ‌య‌సులో రెండేళ్లు చిన్న‌. అలాంటి ఆయ‌న ఆల్రెడీ పార్టీ పెట్టి సీఎం అయ్యి ఆయ‌నేంటో నిరూపించుకున్నారు. సీఎంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో మంచి చేసారు. జ‌గ‌న్ అన్న చేసిన మంచి పనులు చెప్ప‌డానికి కొన్ని పుస్త‌కాలు రాయ‌చ్చు. ఒక చ‌రిత్ర అవుతుంది. కానీ ప‌వ‌న్ గురించి చెప్ప‌డానికి ఏముంది? అత‌ను ఎవ‌రు అస‌లు? అప్పుడెప్పుడో పార్టీ పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుని బ‌య‌టికి వ‌చ్చేసాడు. అప్పుడే చంద్ర‌బాబు ఓ దొంగ అని తిట్టాడు. ఇప్పుడు అదే చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఆ రోజు ఎందుకు దొంగ అన్నావో ఈ రోజు ఎందుకు మంచోడు అంటున్నావో స‌మాధానం చెప్పాల్సిన బాధ్యత ప‌వ‌న్‌దే” అని అన్నారు బైరెడ్డి.