BRS పార్టీకి బిగ్ షాక్!

Hyderabad: ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో BRS పార్టీకి పెద్ద షాక్ ఎదురైంది. కొడంగ‌ళ్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి (gurnath reddy).. కాంగ్రెస్‌లో (congress) చేర‌బోతున్నారు. ఆదివారం TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో గురునాథ్ కాంగ్రెస్‌లోకి చేర‌నున్నారు. గురునాథ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డం వ‌ల్ల కాంగ్రెస్‌కు మెహ‌బూబ్‌న‌గ‌ర్‌లో మంచి బ‌లం చేకూరుతుంద‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క AICC సెక్రెట‌రీ సంప‌త్.. స‌స్పెండ్ అయిన BRS నేత జూప‌ల్లి కృష్ణారావును (jupalli krishnarao) క‌లిసారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ జన స‌మితి (tjs) అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ (kodandaram) కూడా ఉన్నారు. దీనిని బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లో జూప‌ల్లి కూడా కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ జ‌న స‌మితి, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతాయ‌న్న టాక్ న‌డుస్తోంది. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పిడమర్తి రవిలు కూడా ఈ నెల 30న కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారు.