Adipurush: చిత్ర‌బృందంపై హైకోర్టులో పిటిష‌న్

Delhi: ఏది జ‌రుగుతుంద‌ని ముందే ఊహించారో అదే జ‌రిగింది. ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమా చిక్కుల్లో ప‌డింది. డైరెక్ట‌ర్ ఓం రౌత్ సినిమాను ఒక కార్టూన్‌లా తీసి హిందువుల మ‌నోభావాల‌ను కించ‌పరిచాడంటూ దిల్లీలోని హైకోర్టులో పిటిష‌న్ వేసారు. హిందూ సేన (hindu sena) జాతీయ అధ్య‌క్షుడు అయిన విష్ణు గుప్తా ఈ పిటిష‌న్‌ను వేసాడు. రామాయ‌ణాన్ని, సంప్ర‌దాయాన్ని వెక్కిరిస్తూ సినిమా తీసార‌ని, ప్ర‌ద‌ర్శ‌న‌లను నిలిపివేయాల‌ని పిటిష‌న్లో పేర్కొన్నారు. రావ‌ణాసురుడికి సంబంధించిన స‌న్నివేశాలు రామాయ‌ణంలో లేనివి పెట్టార‌ని, ఇలా సంప్ర‌దాయాల‌ను మంట‌గ‌లిపిన చిత్ర‌బృందాన్ని వదిలిపెట్ట‌కూడ‌ద‌ని అన్నారు.