Prabhudeva: నాలుగోసారి తండ్రైన ప్ర‌భుదేవ‌..!

Chennai: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవ (prabhudeva) నాలుగోసారి తండ్ర‌య్యారు. త‌న రెండో భార్య హిమానీ సింగ్ ముంబైలో ఈరోజు పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చారు. 2020లో ఫిజియోథెర‌పిస్ట్ అయిన హిమానీ సింగ్‌ను ప్ర‌భుదేవ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ప్ర‌భుదేవా కుటుంబంలో మొద‌టి ఆడ‌పిల్ల జ‌న్మించింది. దాంతో ప్ర‌భుదేవ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. 2011లో ప్ర‌భుదేవ న‌టి న‌య‌న‌తార‌ను (nayanthara) డేట్ చేసారు.

ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దాంతో అప్ప‌టికే ర‌మాల‌త్‌ను వివాహం చేసుకుని ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్న ప్ర‌భుదేవా ఆమెకు విడాకులు ఇచ్చారు. కానీ న‌య‌న‌తార‌, ప్ర‌భుదేవా మ‌ధ్య ఏవో గొడ‌వ‌లు రావ‌డంతో వీరిద్ద‌రూ విడిపోయారు. 2020లో కాళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డిన ప్ర‌భుదేవా.. ముంబైలో ఫిజియోథెర‌పిస్ట్‌గా ప‌నిచేస్తున్న హిమానీ సింగ్‌ను క‌లిసారు. అలా వీరిద్ద‌రూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్ర‌భుదేవాకు ముందు పుట్టిన ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు క్యాన్స‌ర్‌తో చ‌నిపోయాడు. ఇప్పుడు త‌న ఇంట్లో ఆడపిల్ల పుట్ట‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని పాపతో టైం స్పెండ్ చేయ‌డం కోసం చాలా మ‌టుకు వ‌ర్క్ కూడా ప‌క్క‌కు పెట్టేసాన‌ని ప్ర‌భుదేవ తెలిపారు.