Naga Babu: పెద్దోడైపోయాడు..త‌న‌ అడుగుజాడ‌ల్లో నేను..!

Hyderabad: ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) పెద్ద‌వాడైపోయాడ‌ని, ఇప్పుడు అత‌ని అడుగుజాడ‌ల్లో తాను న‌డుస్తున్నానని అన్నారు నాగ‌బాబు (naga babu). నిన్న జ‌రిగిన వ‌రుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధ వేడుక‌కు (varun tej lavanya tripathi engagement) ప‌వ‌న్ కూడా వెళ్లారు. ప‌వ‌న్‌ను రిసీవ్ చేసుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న వెన‌క నాగ‌బాబు న‌డుస్తున్న‌ప్పుడు తీసిన ఫొటోను పోస్ట్ చేసారు. “చిన్న‌ప్పుడు స‌రైన మార్గంలో వెళ్లాల‌ని నేనే ప‌వ‌న్‌ని గైడ్ చేసేవాడిని. ఇప్పుడు పెద్ద‌వాళ్లం అయిపోయాం. ఎలా న‌డుచుకోవాలో ఎలా న‌డిపించాలో త‌న‌కు బాగా తెలుసు. ఇప్పుడు అత‌ని అడుగుజాడల్లో నేను న‌డుస్తున్నాను” అని ట్వీట్ చేస్తూ జ‌న‌సేనాని అని ట్యాగ్ చేసారు. కొన్ని నెల‌ల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న నాగ‌బాబును జ‌న‌సేన పార్టీ (janasena) జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.