Konda Murali: జ‌గ‌న్‌కు సపోర్ట్ చేసి త‌ప్పు చేసాం

AP: ఏపీ సీఎం జ‌గ‌న్‌కు (ap cm jagan) స‌పోర్ట్ చేసి త‌ప్పు చేసామ‌ని అన్నారు కాంగ్రెస్ నేత కొండా ముర‌ళి (konda murali). దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఎంతో ఆప్తులైన కొండా సురేఖ (konda surekha) దంప‌తులు.. జ‌గ‌న్ పార్టీ పెట్ట‌క‌ముందే ఆయ‌న‌కు స‌పోర్ట్ చేయాల‌నుకున్నారు. జ‌గ‌న్ పాద యాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆయ‌న వెన్నంటే నిలిచారు కానీ అప్ప‌ట్లో ఆయ‌న‌కు స‌పోర్ట్ చేసి త‌ప్పు చేసామ‌ని అంటున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో వారు త‌మ వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

“మేం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కోసం ప‌దవుల‌కు రిజైన్ చేసాం. కానీ జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేసి త‌ప్పు చేసాం. బాగా త‌ల‌పొగ‌రు ఎక్కింది. న‌న్ను ఎన్నో సార్లు జ‌గ‌న్ అవ‌మానించాడు. ఈసారి ఎన్నిక‌ల్లో అత‌ను గెల‌వ‌లేడు అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఇలాంటి యాటిట్యూడ్ ఎవ‌రికి ఉన్నా వాళ్లు గెల‌వ‌లేరు. ఓసారి జ‌గ‌న్ న‌న్ను చూసి అరె నువ్వు ఎమ్మెల్సీ అనుకోలే అన్నాడు. నువ్వేం సీఎం అయితావ్ అని నేన‌న్నా. రాజ‌కీయాలు ఇంత ద‌రిద్రంగా త‌యార‌వుతాయ‌ని అనుకోలేదు” అని తెలిపారు.