Chandrababu: 9 నెల‌ల త‌ర్వాత అమరావతిని పరుగులు పెట్టిస్తా

Mangalagiri: అమ‌రావ‌తి (amaravathi) ఎక్క‌డికీ పోలేద‌ని, 9 నెల‌ల్లో అమ‌రావ‌తి నిర్మాణాన్ని ప‌రుగులు పెట్టిస్తాన‌ని అన్నారు TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu). మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్‌లో నిర్వ‌హించిన ఐటీడీపీ స‌మావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన TDP మినీ మేనిఫెస్టో గురించి ప్ర‌జ‌లంద‌రికీ చేరువ‌య్యేలా చేయాల్సిన బాధ్య‌త ఐటీడీపీదేన‌ని అన్నారు. వివేకా కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు (ap cm jagan) అంతా మంచే జ‌ర‌గాల‌ని దేవాదాయ శాఖ అధికారులు పూజ‌లు చేస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైసీపీలో ఉన్న‌వారంతా జోక‌ర్లేన‌ని, వారిని ఎదుర్కోవ‌డానికి రానున్న ఎన్నిక‌ల్లో కార్య‌కర్త‌లు అస్త్రాలు సిద్ధంచేసుకోవాల‌ని అన్నారు.