న‌న్ను అలా పిలిస్తే బాగోదు: చైత‌న్య‌కు అర‌వింద్‌స్వామి వార్నింగ్

ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్‌గా అమ్మాయిల మ‌న‌సు దోచుకున్న న‌టుడు అర‌వింద్ స్వామి ఇప్పుడు అదే హ్యాండ‌స‌మ్‌నెస్ మెయింటైన్ చేస్తూ విల‌న్‌గానూ మెస్మ‌రైజ్ చేస్తున్నారు. మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ధృవ సినిమాలో విల‌న్‌గా న‌టించి సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న విల‌న్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నుంచి మ‌రో ఎక్స్‌ప‌రిమెంట‌ల్ సినిమా రాబోతోంది. దీనికి క‌స్ట‌డీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసారు. నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. ఇందులో అర‌వింద్ స్వామి ర‌జా అనే విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

అయితే ఈ సినిమాలోని త‌న క్యారెక్ట‌ర్ పేరును స‌రిగ్గా ప‌ల‌క‌డం లేద‌ని అరవింద్ స్వామి.. నాగ‌చైత‌న్య‌, శ‌ర‌త్ కుమార్‌ల‌పై కాస్త మండిప‌డ్డారు. ఈ మేర‌కు ట్విటర్‌లో స‌ర‌దాగా ఓ పోస్ట్ పెట్టారు. “హ‌ల్లో నాగ‌చైత‌న్య‌, శ‌ర‌త్ కుమార్‌.. నా పేరు ర‌జూ (Razoo) రాజు (Raju) కాదు. ఇంకోసారి అలా పిలిస్తే బాగోదు. కేవ‌లం కృతిశెట్టి మాత్ర‌మే నా పేరును స‌రిగ్గా ప‌లుకుతోంది. ర‌జూని క‌స్ట‌డీలో పెట్టాల‌ని కేవ‌లం ప్ర‌య‌త్నం మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. చూస్కుందాం” అంటూ త‌న స్టైల్‌లో ట్వీట్ చేసారు అర‌వింద్ స్వామి. దీనికి కృతి శెట్టి, నాగ‌చైత‌న్య‌ రిప్లై కూడా ఇచ్చారు. “అలాగే ర‌జూ అన్నా..” అని కృతి కామెంట్ పెట్టగా…”యెస్ ర‌జూ స‌ర్” అని రిప్లై పెట్టాడు.

ఈ సినిమాకు వెంక‌ట్ ప్ర‌భు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అర‌వింద్ స్వామి ట్వీట్‌పై వెంక‌ట్ ప్ర‌భు కూడా రిప్లై ఇచ్చారు. “నిజ‌మే క‌దా.. ఇప్ప‌టికీ ఆయ‌న రోజా సినిమాలో ఉన్న‌ట్లుగా యంగ్‌గా, ఫ్రెష్ లుక్‌తో క‌నిపిస్తున్నారు” అని కామెంట్ యాడ్ చేసారు. ఇక‌పోతే ఈ సినిమాలో అర‌వింద్ స్వామి లుక్ మాస్‌గా ఉంది. ఈ సారి కూడా ఆయ‌న ధృవ‌లో మాదిరిగా మ‌రోసారి త‌న విల‌నిజంతో అద‌ర‌గొట్టేలానే ఉన్నార‌నిపిస్తోంది. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మే 12న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.