Vemulawada: ఆల‌యంలోనే చ‌నిపోయిన భ‌క్తురాలు

Sircilla: రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని వేముల‌వాడ (vemulawada) ఆల‌య ప్రాంగణంలోనే ఓ భ‌క్తురాలు చ‌నిపోయిన ఘ‌టన సంచ‌ల‌నంగా మారింది. క‌రీంన‌గ‌ర్ (karimnagar) జిల్లా లింగాపూర్ ప్రాంతానికి ల‌క్ష్మి అనే మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి వేముల‌వాడ (vemulawada) ఆల‌య ద‌ర్శ‌నానికి వెళ్లింది. కానీ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో మంగ‌ళ‌వారం ఉద‌యం ద‌ర్శ‌నం చేసుకుందాం అనుకున్నారు. దాంతో ఆల‌య ప్రాంగణంలోనే నిద్ర‌పోయారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ల‌క్ష్మిని లేప‌డానికి య‌త్నించినా ఆమె లేవ‌క‌పోవ‌డంతో చ‌నిపోయింద‌ని తెలుసుకున్నారు. రాత్రి గుండెపోటు రావ‌డంతో నిద్ర‌లోనే చ‌నిపోయింద‌ని భావిస్తున్నారు.