Train Accident: ముగ్గురు అన్న‌ద‌మ్ముల్ని బ‌లితీసుకున్న ప్ర‌మాదం

Odisha: శుక్ర‌వారం రాత్రి ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంలో (train accident) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. వారు ప‌నిచేస్తే త‌ప్ప పూట‌గ‌డ‌వ‌ని ఆ కుటుంబం ప‌రిస్థితి దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. చ‌నిపోయిన అన్న‌ద‌మ్ములు వెస్ట్ బెంగాల్‌కు (west bengal) చెందిన హ‌ర‌ణ్‌, నిశికాంత్, దివాక‌ర్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరు ముగ్గురూ కుటుంబాల‌ను పోషించుకునేందుకు కూలీ ప‌నుల కోసం ఎక్కువ‌గా ద‌క్షిణ రాష్ట్రాల‌కు వ‌స్తుంటారు. త‌మిళ‌నాడులో (tamilnadu) కూలీ ప‌నుల కోసం కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) రైలులో వీరు ముగ్గురూ ప్ర‌యాణించి ప్రాణాలు కోల్పోయారు. త‌మ భ‌ర్త‌లు, తండ్రులు చ‌నిపోయార‌ని తెలిసి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. వారిని ఓదార్చడం గ్రామ‌స్థుల త‌రం కూడా కావ‌డంలేదు. రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో (odisha train accident) వెస్ట్ బెంగాల్‌కి చెందిన 110 మంది చ‌నిపోయారు. 16 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌పడి వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. ఇంకో 40 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 288కి చేరింది.