Train Accident: జీవితం రెండో అవ‌కాశం ఇచ్చింది!

Odisha: ఒడిశాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న భ‌యంక‌ర రైలు ప్ర‌మాదం (train accident) నుంచి ఓ కుటుంబం మొత్తం త‌ప్పించుకుంది. భార్య, భ‌ర్త వారి కుమారుడు క్షేమంగా బ‌య‌ట‌పడ్డారు. వెస్ట్ బెంగాల్‌లోని పుర్బా మెడినిపూర్ ప్రాంతానికి చెందిన ఓ భార్య, భ‌ర్త వారి కుమారుడు ప‌ని మీద చెన్నైకు వెళ్లాల‌నుకున్నారు. ప్ర‌మాదానికి గురైన‌ కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లో వీరు ప్ర‌యాణిస్తున్నారు. రాత్రి ప‌డుకున్న వీరికి ఏదో శ‌బ్దం వ‌చ్చి లేచి చూసేస‌రికి మొత్తం పొగ క‌మ్మేసి ఉంద‌ని, కాసేప‌టి త‌ర్వాత పెను ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు తెలిసింద‌ని తెలిపారు. ఈ ప్ర‌మాదంలో త‌న కాలికి స్వ‌ల్పంగా గాయ‌మైంద‌ని అన్నారు. ఆ త‌ర్వాత వెంట‌నే వేరే బ‌స్సు ప‌ట్టుకుని తిరిగి స్వ‌స్థ‌లానికి వెళ్లిపోయామ‌ని అన్నారు. జీవితం త‌మ‌కు రెండో అవ‌కాశం ఇచ్చింద‌ని, ఘ‌ట‌న‌లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయార‌ని వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు.