Rahul Ramakrishna: సారీ ట్రైన్ యాక్సిడెంట్ అయిన‌ట్లు తెలీదు

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ (rahul ramakrishna) క్ష‌మాప‌ణలు చెప్పారు. ఒడిశాలో శుక్ర‌వారం రాత్రి భ‌యాన‌క రైలు ప్ర‌మాదం (odisha train accident) చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ యాక్సిడెంట్ గురించి రాహుల్‌కి తెలీక ఓ ఫ‌న్నీ ట్రైన్ జిఫ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసారు. ఆ త‌ర్వాత ట్రైన్ యాక్సిడెంట్ గురించి తెలిసి ఆ జిఫ్‌ని డిలీట్ చేయడంతో పాటు సారీ చెప్పారు.

“సారీ. నాకు ఈ భ‌యంక‌ర ట్రైన్ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లు తెలీదు. నిన్న రాత్రి నుంచి ఓ స్క్రిప్ట్ రాస్తూ కూర్చున్నాను. అస‌లు ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతోందో తెలీలేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ సారీ చెప్తున్నాను. వ‌ర్క్ మీద ఫోక‌స్ పెట్ట‌డంతో ఎలాంటి న్యూస్ చ‌ద‌వ‌డంలేదు” అని ట్వీట్ చేసారు. అయితే ఆ ట్రైన్ జిఫ్ ట్వీట్ డిలీట్ చేసేయ‌డంతో ఓ నెటిజ‌న్ “ఏ ట్వీట్ గురించి మాట్లాడుతున్నారు” అని అడిగాడు. ఇందుకు రాహుల్ స్పందిస్తూ.. “బ‌స్ట‌ర్ కీట‌న్ సైలెంట్ మూవీలోని రైళ్ల‌కు సంబంధించిన జిఫ్ పోస్ట్ చేసాను. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవ‌డం అన‌వ‌స‌రం” అని తెలిపారు.