Odisha Train Accident: ర‌క్తదానం చేయ‌డానికి క్యూ క‌ట్టిన ప్ర‌జ‌లు

Odisha: మాన‌వ‌త్వం ఇంకా మంట క‌లిసిపోలేద‌ని రుజువు చేసారు ఒడిశా ప్ర‌జ‌లు. నిన్న రాత్రి జ‌రిగిన భ‌యాన‌క రైలు ప్ర‌మాదంలో (odisha train accident) దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. మ‌రో 900 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే వారిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. తీవ్రంగా బ్లీడింగ్ అవ‌డంతో బతికే ఛాన్సులు త‌క్కువ అని డాక్ట‌ర్లు చెప్తున్నారు. విష‌యం తెలుసుకుని ప్ర‌మాదం జ‌రిగిన జిల్లాలో నివ‌సిస్తున్న ఎంద‌రో గ్రామ‌స్థులు రాత్రి 11.30 స‌మ‌యంలో ర‌క్త‌దానం చేస్తామంటూ లైన్ క‌ట్టారు. ఎంత ఆల‌స్య‌మైనా ఫ‌ర్వాలేదు.. కూర్చోవ‌డానికి క‌ర్చీలు లేక‌పోయినా ఫ‌ర్వాలేదు ర‌క్త‌దానం చేసాకే ఇంటికి వెళ్తాం అంటూ మాన‌వత్వాన్ని చాటుకున్నారు.