Telangana Formation Day: సర్కారు మారితేనే బతుకులు మారుతాయి

Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం (Telangana Formation Day) సంద‌ర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ BRS పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అస‌లు తెలంగాణ ఇలా పుట్టింది అంటూ ట్వీట్ చేసారు. “నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై, కొట్లాడితే వచ్చింది తెలంగాణ. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ.. దొరల పాలన మళ్లీ వచ్చిన యాళ్ల, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే YSR తెలంగాణ పార్టీ. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి.. గెలిచి, నిలిచింది YSRTP”

“అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడింది. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించింది. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా.. మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది. నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించింది. 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, KCR ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది”

“ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలి. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలన్నా YSR సంక్షేమ పాలన రావాలి. జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలి. అర్హులకు పోడు పట్టాలు అందాలి. పేదలకు భూములు దక్కాలి. దళిత, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. ప్రజలు అభివృద్ధి బాట పట్టాలి. ఇందుకోసం YSR బిడ్డ కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.