ఆ ప్ర‌శ్న‌కు భ‌య‌ప‌డి ప‌రిగెత్తిన మంత్రి.. KTR వైర‌ల్ కామెంట్!

Hyderabad: మీడియా అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక ఓ మ‌హిళా మంత్రి ప‌రుగులు తీసిన వీడియోపై తెలంగాణ ఐటీ మంత్రి KTR చేసిన కామెంట్ వైర‌ల్‌గా మారింది.  దాదాపు నెల రోజులుగా దిల్లీలో మ‌హిళా రెజ్ల‌ర్లు త‌మకు న్యాయం చేయాలంటూ WFI రెజ్ల‌ర్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూష‌ణ్ సింగ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక కేంద్రం నుంచి ఏ సాయం అంద‌క‌పోవ‌డంతో ఈరోజు వారు గెలిచిన మెడ‌ల్స్ హ‌రిద్వార్‌లోని గంగా న‌దిలో విసిరేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం అని మీడియా ప్ర‌తినిధులు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖిని ప్ర‌శ్నించారు. దీనికి ఆమె స‌మాధానం చెప్ప‌లేక ప‌రుగులు తీసారు. ఆ త‌ర్వాత కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన కామెంట్ వైర‌ల్‌గా మారింది. నేను భాగ్ మిల్కా భాగ్ గురించి విన్నాను కానీ ఇదేంటి భాగ్ మంత్రి భాగ్. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం లేనప్పుడు ప‌బ్లిక్, మీడియా నుంచి ఇలాగే త‌ప్పించుకోవాల్సి వ‌స్త‌ది అని కామెంట్ చేసారు.