Narendra Modi: మోదీని చంపేందుకు కుట్ర‌.. క‌ర్ణాట‌క‌లో NIA దాడులు

Bengaluru: ప్రధాని నరేంద్ర మోదీని (narendra modi) చంపేందుకు కుట్ర ప‌న్నుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం రావ‌డంతో క‌ర్ణాట‌క (karnataka) రాష్ట్రంలో NIA (నేష‌నల్ ఇన్‌వెస్టిగేష‌న్ ఏజెన్సీ) దాడులు నిర్వ‌హిస్తోంది. క‌ర్ణాట‌క వ్యాప్తంగా మొత్తం 16 లొకేష‌న్ల‌లో NIA రైడ్లు జ‌రుగుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో బ్యాన్ చేయ‌బ‌డిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సంస్థ.. 2022 జులైలో మోదీ ప‌ట్నాలో ప‌ర్య‌టించ‌డానికి వెళ్లినప్పుడు ఆయ‌న్ను చంపేందుకు కట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. బుధ‌వారం జ‌రిగిన రైడ్ల‌లో పుత్తూరు, కుర్నాడ‌కా, తారిప‌డుపు, కుంబ్రా గ్రామాల్లో అనుమానితుల్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. గ‌తేడాది మోదీపై ఎటాక్ చేయ‌డం మిస్స‌వ‌డంతో PFI ఇప్పుడు ప్లాన్లు చేప‌డుతోంద‌ని ED త‌మ రిమాండ్ నోట్‌లో తెలిపింది. క‌ర్ణాట‌క‌లోని మొత్తం 16 ప్రాంతాల్లో PFIకు చెందిన అన్ని ప్ర‌దేశాల్లో స్థానిక పోలీసుల సాయంతో NIA అధికారులు దాడులు చేప‌డుతున్నారు. ద‌క్షిణ క‌ర్ణాట‌క‌లో పీఎఫ్ఐకు చెందిన ఆన‌వాళ్లు ఉన్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.