IPLకి గుడ్‌ బై చెప్పిన రాయుడు.. అంతలోనే మ్యాచ్ రద్దు!

hyderabad: తెలుగు క్రికెటర్‌… ప్రస్తుతం చెన్నై తరఫున ఆడుతున్న అంబటి రాయుడు(ambati rayudu) ఐపీఎల్‌(ipl)కు గుడ్‌ బై చెప్పాడు. ఇప్పటికే దేశవాళీ, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు.. తాజాగా ఐపీఎల్‌ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఆదివారం ఈ ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌కు చెన్నై, గుజరాత్‌ జట్లు చేరాయి. ఆదివారం ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దైంది. కానీ మన రాయుడికి మాత్రం తొందరెక్కువ.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కాకుండా.. మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది అనగా.. రాయుడు ట్వీట్‌ చేశాడు. ఈక్రమంలో భారీ వర్షం కురవడంతో కనీసం ఒక్క ఓవర్‌ వేయకుండానే రద్దు చేశారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ను సోమవారం నిర్వహించనున్నారు. మరి ఈ మ్యాచ్‌లో రాయుడు ఆడతాడా.. లేదా అన్నది చూడాల్సి ఉంది. కొందరు నెటిజన్లు మాత్రం… రాయుడూ ఎందుకంత తొందర అని ట్వీట్‌ చేస్తున్నారు.