RGV: నందమూరి కుటుంబంలో ఒక్క మగాడు జూ.ఎన్టీఆర్​!

Vijayawada: ఎన్టీఆర్​ శతజయంతి(NTR 100th Birth Anniversary) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు (మే 28న) ఎన్టీఆర్​ శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నాని, పలువురు వైసిపి నాయకులు, లక్ష్మి పార్వతి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను ఓ జోక్ చెప్పడానికే బెజవాడకు వచ్చాను కానీ నవ్వురాని ఆ జోక్ రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రిలో సభను చూసి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. వాళ్లే చంపేసి… ఈ రోజు వాళ్లే రక్తం తుడిచేశారు. ఎన్టీఆర్ ను చంపేసినోడి పక్కనే కూర్చుని రజనీకాంత్ పొగడటం నాకు చాలా బాదేసింది. రజనీకాంత్ వ్యాఖ్యలు చూస్తే ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచినట్లే ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. మొసలి, పాము తరహాలో కన్నార్పని జీవి చంద్రబాబు. నేను తీయబోయే కొత్త సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ ను అరటి పండు ఒలిచినట్లు నోట్లో పెడతాను. ఆ తీయదనం మీరంతా కచ్చితంగా ఆస్వాదిస్తారు’ అని అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి.